తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 7 August 2016

న్యస్తాక్షరి - ‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
 
అంశం- రామకథ. 
ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక.
పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.


తేట గీతి: 
శ్రీధవుండిల రక్షింప శిష్ట జనుల 
సీతగా సిరి రాముడై చేరె తాను 
తాము శంఖమ్ము చక్రమ్ము పాము పడక 
రాము తోడుగ బుట్టెగా ప్రేమ మీర 
మునుల యాగమ్ము రక్షించి జనక పురిని 
లలన సీతను పెండ్లాడె, పలుక తండ్రి 
కుదురుగా వనముల కేగె కోరి కోరి 
వంకరాలోచనలు జేసి లంక రాజు 
దరికి జేరిచి మైథిలిన్ దాచగాను 
నచ్చి హనుమను బంపగా నాతి వెదకె 
ముష్కరాధములందర మోదిజంప 
లుప్తమయ్యెను పాపాలు లోకమందు.

No comments: