తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 3 July 2015

పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాండు కుమారులు నలుగురు పదుగురు మెచ్చన్.


కందము:
ఉండగ ధర్మజుడే తా
నండగ ధర్మంబు తోడు నగ్రజుడగుచున్
మండెడి గుండెలనాపిరి
పాండు కుమారులు నలుగురు, పదుగురు మెచ్చన్.

No comments: