తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 28 March 2015

న్యస్తాక్షరి: ‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 03 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


న్యస్తాక్షరి: అంశం- రామకథ.
ఛందస్సు- (పన్నెండు పాదాల) తేటగీతిక.
పన్నెండుపాదాల మొదటి అక్షరాలు వరుసగా
‘శ్రీ-సీ-తా-రా-ము-ల-కు-వం-ద-న-ము-లు’ ఉండాలి.


 


















తేట గీతి:
శ్రీధవుండిల రక్షింప శిష్ట జనుల
సీతగా సిరి రాముడై చేరె తాను
తాము శంఖమ్ము చక్రమ్ము పాము పడక
రాము తోడుగ బుట్టెగా ప్రేమ మీర
మునుల యాగమ్ము రక్షించి జనక పురిని
లన సీతను పెండ్లాడె, పలుక తండ్రి
కుదురుగా వనముల కేగె కోరి కోరి
వంకరాలోచనలు జేసి లంక రాజు
రికి జేరిచి మైథిలిన్ దాచగాను
చ్చి హనుమను బంపగా నాతి వెదకె
ముష్కరాధములందర మోదిజంప
లుప్తమయ్యెను పాపాలు లోకమందు.

No comments: