శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-02-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.
తేటగీతి:
భారతమ్మును భాగవ తారు మొదట
నాది పర్వము జెప్పెను నాడు, నేడు
విన సభా పర్వమది వల్వ 'విలువ లూడ్చు
పర్వ' దినమని యేడ్చిరి సర్వజనులు.
తేటగీతి:
ధరను పెరుగగ నన్నింట ధరలు జూడ
తార లంటగ వంటకు దారి లేక
పాయసంబును తిన గల్గు భాగ్య మపుడె
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు.
సమస్య - పర్వ దినమని యేడ్చిరి సర్వజనులు.
తేటగీతి:
భారతమ్మును భాగవ తారు మొదట
నాది పర్వము జెప్పెను నాడు, నేడు
విన సభా పర్వమది వల్వ 'విలువ లూడ్చు
పర్వ' దినమని యేడ్చిరి సర్వజనులు.
తేటగీతి:
ధరను పెరుగగ నన్నింట ధరలు జూడ
తార లంటగ వంటకు దారి లేక
పాయసంబును తిన గల్గు భాగ్య మపుడె
పర్వదినమని యేడ్చిరి సర్వజనులు.
No comments:
Post a Comment