తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 20 September 2012

మానినీమణి భర్తనే మఱచిపోయె.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - మానినీమణి భర్తనే మఱచిపోయె.

తేటగీతి:
తిరుమలేశుని జూడగ వరుసలోన
మోకరిల్లుచు దూసుకు ముందు కేగె
తన్మయంబున; చూడక తనదు వెనుక
మానినీమణి భర్తనే మఱచిపోయె.

No comments: