శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి
తేటగీతి:
వేల వేలుగ వివిధ మౌ విగ్రహములు
వేయ హుస్సేను సాగరు, వెలుగులందు
విఘ్న నాధు నిమజ్జన వేడ్క జూడ
నగరి దరికిని, సతి తోడ నంది నెక్కి
గరళకంఠుండు పయనించె, గరుడు నెక్కి
హరియె పయనించె సిరి తోడ, హంస నెక్కి
వాణి తోడను పయనించె బ్రహ్మ కూడ
భాగ్య నగరపు భాగ్యము బాగు బాగు.
సమస్య - గరళకంఠుండు పయనించె గరుడు నెక్కి
తేటగీతి:
వేల వేలుగ వివిధ మౌ విగ్రహములు
వేయ హుస్సేను సాగరు, వెలుగులందు
విఘ్న నాధు నిమజ్జన వేడ్క జూడ
నగరి దరికిని, సతి తోడ నంది నెక్కి
గరళకంఠుండు పయనించె, గరుడు నెక్కి
హరియె పయనించె సిరి తోడ, హంస నెక్కి
వాణి తోడను పయనించె బ్రహ్మ కూడ
భాగ్య నగరపు భాగ్యము బాగు బాగు.
No comments:
Post a Comment