శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు
17-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - "కొమ్మ, ఆకు, కాయ, పండు" పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో..
మయసభ నుండి అవమానము తో వచ్చిన రారాజు మనస్థితి...
తేటగీతి:
ఆ కులట కృష్ణ మదమెక్కి యచట నవ్వె
కాయమున గాదు మనసున గాయ మయ్యె
పండుకొన్నను నిద్దుర పట్ట దాయె
కొమ్మ పొగరును దించగా కోరె మనసు .
1 comment:
chala bagundi dattapadi purana...you are great in spontaniously secting the ideas..i liker that instinct...srinivas.
Post a Comment