నిన్న కోటప్పకొండ క్షేత్రమున కొలువైయున్న త్రికూటేశ్వరుని దర్శించిన వేళ స్ఫురించిన పద్యము.
ఆ కొండపైకి ఎప్పుడూ కాకులు రాకుండుట ఆ క్షేత్ర మాహాత్మ్యము.
కందము:
కాకులు చేరని గిరిపై
శ్రీకరముగ వెలసినట్టి చిద్రూపా! చీ
కాకులు చేరని బ్రతుకును
మాకందీయుము త్రికూట మలయాధీశా!
No comments:
Post a Comment