శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.
తేటగీతి:
చంద్రు డన నాడు మామయ్య, చక్కనయ్య
సిరికి తమ్ముడు, చూడగా చెలియ వినుము
బూది కుప్పలు గుంటలు బోలెడన్ని
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు.
తేటగీతి:
రూక లేనట్టి వానిని రోసి జగము
పైకమున్న వానిని తలపైన బెట్టు
కొనును,కలిలోన నేమనుకొన్న "నాల్గు
రాళ్ళు గలిగినవాఁడె పో రాజు నేఁడు."
1 comment:
ee site chaala baagundi.
Post a Comment