శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : పరుని పైన సాధ్వి మరులు గొనెను
ఆ.వె : కంటనీరు బెట్ట కలుములు గలుగవు,
మహిళ లన్న మహిని మాతృ సములు;
అన్న భావనున్న ఆత్మనాధు, దయా
పరుని పైన;సాధ్వి మరులు గొనెను.
సమస్య : పరుని పైన సాధ్వి మరులు గొనెను
ఆ.వె : కంటనీరు బెట్ట కలుములు గలుగవు,
మహిళ లన్న మహిని మాతృ సములు;
అన్న భావనున్న ఆత్మనాధు, దయా
పరుని పైన;సాధ్వి మరులు గొనెను.
2 comments:
ఓరగంట జూచి యువతీలలామ
పెండ్లి చూపులందు పెద్దలడుగ
వరుని చంద్ర వదను వల్లభు సద్గుణ
పరుని జూచి సాధ్వి వలచె మదిని
శ్రీ "కమనీయం " గారికి నా బ్లాగునకు స్వాగత పూర్వక నమస్కారములు. కమనీయమైన పూరణను చేసినారు. శంకరాభరణం బ్లాగునకు కవి మిత్రునిగా రాగలరని ఆశించుచున్నాను.
'కమనీయమైన' శారదా దేవి వర్ణ చిత్రముతో 'కనువిందు' చేయుచున్న మీ బ్లాగు చూచినాను. పలు విషయములను పద్య, గద్య , కవితా రూపములలో పలు విధములుగా చెప్పుచున్న విధము కమనీయముగా నున్నది. తరచూ వీక్షణలను, అమూల్య వ్యాఖ్యలను కోరుతూ ....
Post a Comment